చేకూరపాడు ఉన్నత పాఠశాల మొదటి వ్యవస్థాపక సభ్యుల కమిటీ సమావేశం శ్రీ వేణు గోపాల స్వామి వారి దేవాలయం ఆఫీసులో తేదీ 07 -09 -1961న ఏర్పాటు చేసుకోవడము జరిగింది.

వ్యవస్థాపక కమిటీ సభ్యులు


ఈ మొదటి సమావేశం లో శిరిగిరి బైరాగి గారిని తాత్కాలిక అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ క్రింది కార్య నిర్వాహక వర్గాన్ని ఎన్నుకొన్నారు

  • శిరిగిరి బైరాగి ఉరఫ్ భానుప్రసాద్ - అధ్యక్షులు
  • ఉప్పల పాటి సత్యనారాయణ - కార్యదర్శి
  • వడ్డెల్ల వీరయ్య చౌదరి - కోశాధికారి

ఈ సభ్యులెవరూ ప్రస్తుతం జీవించి లేరు. అందరూ కీర్తిశేషులయ్యారు. వారు స్థాపించిన పాఠశాలలో కొన్ని వందలమంది విద్యార్థులు ఇప్పటికీ చదువుకొంటూనే ఉన్నారు. వారి జన్మ ధన్యమయింది.